TG: రాష్ట్రంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో బలమైన పశుసంపద ఉందని పేర్కొన్నారు. గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని వెల్లడించారు. కాగా, పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, మైనార్టీ, సంక్షేమ శాఖల పద్దులను అసెంబ్లీ ఆమోదించింది.