2025-26 ఏడాదిలోని మూడో త్రైమాసికంలో తమ వెబ్ సైట్పై సైబర్ దాడులకు యత్నాలు జరిగినట్లు RBI వెల్లడించింది. ఏకంగా 6.1 కోట్లకు పైగా సైబర్ దాడి చేసేందుకు యత్నించినట్లు చెప్పింది. అయితే అత్యాధునిక రక్షణ వ్యవస్థ కారణంగా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు పేర్కొంది. గతేడాది ఏప్రిల్- జూన్ మధ్య 1.9 కోట్లు, జులై-సెప్టెంబర్ మధ్య 3.1 కోట్ల సార్లు దాడికి యత్నించినట్లు తెలిపింది.