AP: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం నేపథ్యంలో కీలక విషయం వెల్లడైంది. బస్సు కండీషన్ సరిగా లేదని ప్రయాణికులు ఆందోళన చేయగా.. సిబ్బంది యర్రగొండపాలెం వద్ద బస్సు గంటసేపు నిలిపి మరమ్మతులు చేశారు. అనంతరం బస్సు బయల్దేరగా రాయవరం వద్ద ఘోరం జరిగింది. డ్రైవర్ను విచారించగా.. స్టీరింగ్ స్ట్రక్ అయిందని చెప్పినట్లు సమాచారం.