SRD: గుమ్మడిదల మండలంలో MNREGS కింద రూ.50 లక్షలతో మంజూరైన పలు సీసీ రోడ్ల పనులను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎంపీ ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.