VSP: అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న గర్భిణికి రాయగడ సమీపంలో ప్రసవ వేదనలు రావడంతో టిటిఇ ఎస్. శ్రీకాంత్ వెంటనే స్పందించారు. పార్వతీపురం స్టేషన్లో వైద్య సహాయం ఏర్పాటుచేయగా, రైలులోనే ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు క్షేమంగా ఉండగా, ఆసుపత్రికి తరలించినట్టు విశాఖ రైల్వే అధికారులు తెలిపారు.