NZB: ధర్పల్లి TRP జిల్లా వైస్ ప్రెసిడెంట్గా సంబటి సుమన్ను నియమిస్తూ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల సందీప్ పటేల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడేందుకు సుమన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.