W.G: ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని నరసాపురం బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. CM సహాయనిధి నుంచి మంజూరైన రూ.7.50 లక్షల విలువైన చెక్కును రాయపేటకు చెందిన తమ్మిశెట్టి బాజ్జీ కుటుంబానికి సోమవారం అందజేశారు. నేరుగా లబ్ధిదారుల నివాసానికే వెళ్లి ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకోవడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.