NTR: తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లిలో సోమవారం సిలువ మార్గ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. స్థానిక RCM చర్చి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో క్రైస్తవ సోదరులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యేసుక్రీస్తు పడిన శ్రమలను స్మరించుకుంటూ, భక్తులు సిలువను మోస్తూ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్రార్థనలతో ఊరేగింపు నిర్వహించారు.