GDWL: స్త్రీనిధి రుణాలను పొందిన మహిళలు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్లో స్త్రీనిధి పథకం ద్వారా రూ.3 లక్షల రుణంతో కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ ఆటోలను ఆయన ప్రారంభించారు. ఈ వాహనాలను ఉండవెల్లి మండలం చిన్న ఆముదాలపాడు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.