SRD: ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 46 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.24,38,870 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్, ఈవో శివరుద్రప్ప పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.