VZM: పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా వైసీపీ గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు త్వరతిగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం గరివిడిలో వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యాలని కోరారు. అలాగే, స్థానిక ఎన్నికలో వైసీపీ జెండా ఎగరాలని నాయకులకు దిశ నిర్దేశం చేశారు.