SS: ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ నంబులపూలకుంట(మం) ధనియాని చెరువు గ్రామంలో ప్రపంచ నీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జల్ జీవన్ మిషన్, ఉపాధి హామీ పథకాల సహకారంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించి భావితరాల భవిష్యత్తును కాపాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.