WNP: గ్రంథాలయాలు దేశ భవిష్యత్తును మార్చే జ్ఞాన ఆలయాలని సమ్మిళిత విద్య సమన్వయకర్త (CMO) ప్రతాపరెడ్డి అన్నారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వల్లభ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. చదవడం ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు.