GDWL: కాలూరు తిమ్మందొడ్డి మండలంలోని జూరాల కుడి కాలువలో కొంత మంది రైతులు రాళ్లతో అడ్డంకులు సృష్టించారు. యాసంగి పంటలకు అత్యవసరమైన సమయంలో డిస్ట్రిబ్యూటరీ నంబర్ 12 వద్ద నీటి ప్రవాహం నిలిచిపోతుంది. దీంతో అనంతపురం, బస్రాచెర్వు గ్రామాలకు సాగునీరు అందకపోవడంతో రైతులు అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నారు.