MDCL: పట్టణంలోని హరిదాస మండపంలో శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం సీతారామ మందిరం ప్రాంగణంలో స్వామివారికి మిరియంపల్లి వరుణ్ కుమార్ శర్మ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కందకట్ల సుదర్శన్ రెడ్డి, పరంకుశం మాధవ్, రామచంద్ర రావు, చెందిల్ తదితరులు పాల్గొన్నారు.