GNTR: ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల 95వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జి. బాలకృష్ణ పాల్గొని, మాట్లాడారు. స్వాతంత్ర పోరాటంలో అనేక మంది దేశభక్తులు ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలు కొనసాగించాలన్నారు.