GNTR: ఈనెల 19న పత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని యనమదల వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు వేగవంతంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మృతుడు మద్యానికి బానిసై తన భార్యను తరచుగా వేధింపులకు గురి చేస్తున్న క్రమంలో హత్య జరిగినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.