ప్రకాశం: కొండపి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బోధవాటి సోమయ్య అనారోగ్యానికి గురై మెడిక్యూర్ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా మంత్రి స్వామి ఆదివారం ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. సోమయ్యకు మంత్రి స్వామి డాక్టర్ కావడంతో పలు సూచనలు చేశారు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.