ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాలగూడెం, ఇందిరమ్మ కాలనీలో ఇవాళ తెల్లవారు జామున ట్రైనీ ఐపీఎస్ జయశర్మ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలోకి వచ్చే కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తుల కదలికల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.