ATP: రాయదుర్గం సిద్ధప్పకొండపై వెలసిన శ్రీ రస సిద్ధేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రథానికి గుర్రాలను పంపే ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సతీసమేతంగా పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో స్థానిక నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.