ADB: కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం దక్కుతుందని ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్సీ విభాగం మండల అధ్యక్షులతో శనివారం సమావేశమై మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకాలలో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.