TG: ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఒక్క ప్రాజెక్టు మీదే లక్షల కోట్లు ఖర్చు చేసి మిగతా వాటిని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు మిగతా ప్రాజెక్టులకు, భూసేకరణకు తీవ్రంగా నిధుల కొరత ఉందన్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో ప్రాజెక్టలన్నింటినీ పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామన్నారు.