KMM: విద్య, వైద్యం, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, గ్యారంటీల అమలుతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ప్రశంసించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి, పునర్నిర్మాణానికి పునాది వేసిందని నేడు వెల్లడించారు.