E.G: గోపాలపురం మండల వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలు శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజులు నిర్వహించి, ఖురాన్ పఠనం చేశారు. 30 రోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే ఈ పండుగ మానవత్వానికి, సోదరభావానికి ప్రతీక అని మత పెద్దలు ప్రసంగించారు. నమాజు అనంతరం ఒకరికొకరు ‘ఈద్ ముబారక్’ తెలుపుకుంటూ శుభాకాంక్షలు పంచుకున్నారు.