MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ కు చెందిన గడ్డి వెంకటేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియామకమయ్యారు. జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీచేశారు. జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు మైనంపల్లి హనుమంతరావుకు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.