NZB: భీంగల్ ఎంపీపీఎస్ పాఠశాలను శుక్రవారం MEO స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) AXL కంప్యూటర్ తరగతులను ఆయన పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభ, శిక్షణ గురించి ప్రధానోపాధ్యాయుడు సత్య రమేష్ను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపడం పట్ల ఎంఈవో హర్షం వ్యక్తం చేశారు.