SRPT: జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లిలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇవాళ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వంగాల సుకుమార్ రాజు (28) ఫైనాన్స్, మనీ లోన్స్ యాప్ ద్వారా లోన్ తీసుకుని ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాడు. ఒత్తిళ్ల నేపథ్యంలో మానసిక ఆవేదనకు గురై ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.