JN: పాలకుర్తిలో విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులు బుధవారం ముఖ్య సమావేశం నిర్వహించారు. జిల్లా బాధ్యులు ఎండీ షరీఫ్, ఇమ్మడి అశోక్, చిదురాల శ్రీనివాస్, శేషగిరిరావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య పట్ల నిర్లక్ష్య విధానాన్ని వ్యతిరేకించాలన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జూన్ 27న నిర్వహించబోయే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.