NGKL: వంగూరు మండలంలోని తిరుమలగిరి, తిప్పారెడ్డిపల్లి, జాజాల, రంగాపూర్ తండాల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం నాటు సారా తయారీ కేంద్రాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 800 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని, ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు.