PLD: సత్తెనపల్లిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రధాన కూడళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ హనుమంతురావు తెలిపారు. చైన్ స్నాచర్ల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం కావడంతో అవి నిరంతరం పనిచేసేలా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. పట్టణ ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.