JGL: కొడిమ్యాల మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో అక్షరాలను బోర్డుపై రాయించారు. మోడల్ స్కూల్లోనే కాకుండా కొడిమ్యాలలోని పలు కాలనీలను సందర్శించి చెత్త ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు.