E.G: సీతానగరం గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి స్థానిక మహిళలు గురువారం 108 రకాల పిండి వంటలతో సారెను సమర్పించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయం కొనసాగుతుందని గ్రామస్థులు తెలిపారు. గరగ నృత్యాలు బాణసంచా కాల్పులతో సారెను గ్రామంలో ఊరేగించి, ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో సుమారు 900 మంది మహిళలు పాల్గొన్నారు.