HYD: రంజాన్ మాసం చివరి శుక్రవారం ‘జుమాతుల్ విదా’ ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ చుట్టూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహనాల మళ్లింపులు అమలులో ఉంటాయి. మదీనా, హిమ్మతురా, చౌక్ మైదాన్, ఏతబార్ చౌక్ తదితర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు.