NRPT: పవిత్ర రంజన్ నెల ఎంతో విశిష్టమైనదని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. నారాయణపేట పట్టణంలోని జామ మస్జిద్, హాజిఖాన్ పేట మస్జిద్లలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. ముందస్తుగా రంజన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు.