నిర్మల్ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వేలాది కూలీలకు పనులు కల్పిస్తున్నా, వసతుల లోపం తీవ్రంగా కనిపిస్తోంది. మొత్తం 1.74 లక్షల జాబ్ కార్డులు, 3.20 లక్షల కూలీలు ఉండగా రోజూ 35 వేల మందికిపైగా పనులకు హాజరవుతున్నారు. అయితే పని ప్రదేశాల్లో నీడ, తాగునీటి సదుపాయాలు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.