JGL: కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో ముస్లింలకు రంజాన్ కానుకలను గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం పంపిణీ చేశారు. రంజాన్ పండుగ వేళ పేద ముస్లింలు అందరితో పాటు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం రంజాన్ కానుకలను పంపించిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ లక్ష్మి, కార్యదర్శి రాజేష్, నాయకులు గంగారాం, నరేష్, రఫీ పాల్గొన్నారు.