KNR: సైదాపూర్ మండలంలోని గుండ్లపల్లిలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడి రైతు రచ్చ రాజుకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. నిత్యం పాలిస్తూ జీవనాధారంగా ఉన్న ఆవు మరణించడంతో ఆ పేద కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. పాడిపైనే ఆధారపడి బతుకుతున్న తమకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.