VKB: దోమ మండలం గూడూరు గ్రామంలో గత 15 రోజులుగా నీళ్లు రాక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి రావాల్సిన మంచి నీటి బోరు మోటార్ పడైపోయిందని తెలిపారు. గ్రామస్థులు సర్పంచ్, సెక్రటరీ, వర్డ్ మెంబర్స్కు తెలియజేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు త్వరగా సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.