ఆదిలాబాద్ పట్టణంలో వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. కెఆర్కె కాలనీలో కౌన్సిలర్ రజిత రాము ఆధ్వర్యంలో నిరుపయోగంగా ఉన్న బోరింగులకు మరమ్మతులు చేయించారు. ఆమె మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.