GDWL: వడ్డేపల్లి పట్టణాన్ని రోగాల బారి నుంచి రక్షించాలంటే పరిశుభ్రతే ఏకైక మార్గం అని మున్సిపల్ ఛైర్మన్ మంజుల ధర్మ పేర్కొన్నారు. బుధవారం తెలవరుజమున ప్రధాన రహదారులు, బజార్లలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న పనిని పరిశీలించారు. పట్టణ సౌందర్యాన్ని దెబ్బతీసేలా రోడ్లపై చెత్త వేయకూడదని, ప్రతి ఒక్కరూ మున్సిపల్ వాహనాలకే వ్యర్థాలను అందించాలన్నారు.