PDPL: సింగరేణి ఆర్జీ-1 ఏరియా పరిధిలోని ఆర్సీఓఏ క్లబ్లో ఈనెల 19న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో ఆయుర్వేద నిపుణులు విశ్వనాధ మహర్షి పాల్గొని బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, థైరాయిడ్ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.