CTR: ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. పన్ను బకాయిలను ఒకేసారి చెల్లించి వడ్డీలో రాయితీ పొందవచ్చని తెలిపారు. ఈనెల 31వ తేదీ లోపు పన్ను బకాయిలు పూర్తిస్థాయిలో ఒకేసారి చెల్లించిన వారికి రాయితీ లభిస్తుందన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.