NLG: నకిరేకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజా గాయని వేముల పుష్పక్క ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. విద్యే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని, ఈ సాయం గ్రామీణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.