SDPT: హుస్నాబాద్ పట్టణ శివారులోని వ్యవసాయ పొలాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. రైతుల బోర్ల వద్ద ఉన్న సుమారు 30 మోటార్ల కేబుల్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఎండకాలంలో నీటి కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో, వరుస దొంగతనాలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని అన్నారు. దొంగతనాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.