NRPT: కృష్ణ మండలంలోని బ్రిడ్జి సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడు మాగనూరుకు చెందిన నల్లె నాగప్ప(45)గా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం ఆయన స్పృహతప్పి పడిపోయినట్లు సమాచారం. మృతుడి తమ్ముడు కురుమయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై నవీద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.