ELR: చౌకధరల దుకాణాల్లో పేదలకు ఇవ్వాల్సిన కందిపప్పు పంపిణీ ఏడాదికి పైగా నిలిచిపోయింది. ఏలూరు జిల్లాలో 1164 డిపోలలో 6.40 లక్షల కార్డుదారులు ఉండగా వారిలో ఎక్కువ మంది రేషన్ సరకులపైనే ఆధారపడుతున్నారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండగల సమయంలోనూ కందిపప్పు ఇవ్వకపోవడంతో కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా చౌక దుకాణాల్లో కేజీ రూ.67 ఉంది.