AP: శ్రీశైలంలో భక్తులకు తృటిలో ప్రమాదం తప్పింది. అక్కడ ఓ వీఐపీ కాటేజీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో భక్తులు బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలార్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.