కృష్ణా: మోపిదేవి(M) పెదప్రోలు గ్రామపంచాయతీలో ఇంటి, కుళాయి పన్నుల సమస్యలపై గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు. గతేడాది పన్నులు చెల్లించినప్పటికీ, ఈ ఏడాది ప్రభుత్వం చేపట్టిన స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఇంటి, నీటి పన్నుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామంలో పలు సమస్యలపై PGRSలో ఫిర్యాదు చేసిన పరిష్కారం లేదన్నారు.