KMR: బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం సర్పంచ్ రమేశ్ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామంలో నీటి ఎద్దడి ఉన్న కాలనీలను గుర్తించి, సమస్యను వెంటనే పరిష్కరించాలని తీర్మానించారు. పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని, ఎర్రమ్మ కుచ్చలో కొత్త మురికి కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.