అన్నమయ్య: కురబలకోట మండలం అంగళ్లు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు పురుషోత్తం(26), మణికంఠ(21) తీవ్రంగా గాయపడ్డారు. వాల్మీకిపురం మండలం పత్తేపురానికి చెందిన వీరు, తమ సోదరిని చూసేందుకు బైకుపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఢీకొంది. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.